నవతెలంగాణ-హైదరాబాద్: అన్నా యూనివర్శిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలిన జ్ఞానశేఖరన్కు మహిళా కోర్టు జీవిత ఖైదు విధించింది. దోషికి రూ.90,000 జరిమానా కూడా విధిస్తున్నట్లు సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దోషి సుమారు 30 ఏళ్లు జైలులో ఉండాలని జడ్జి ఎం. రాజలక్ష్మి పేర్కొన్నారు.
తన తల్లి, మైనర్ కుమార్తెల బాధ్యతల దృష్ట్యా కనీస శిక్ష విధించాలంటూ స్థానిక బిర్యానీ విక్రేత, దోషి జ్ఞాన శేఖరన్ గతంలో కోర్టుకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దోషి జ్ఞానశేఖరన్ గతేడాది డిసెంబర్ 23న చెన్నైలోని అన్నా యూనివర్శిటీ క్యాంపస్లోకి ప్రవేశించి విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెతో పాటు ఉన్న సీనియర్ విద్యార్థిని కొట్టి అక్కడి నుండి పారిపోయేందుకు యత్నించాడు.