- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ఆగస్టు 29 నాటికి ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లోని కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని సూచించింది.
- Advertisement -



