Sunday, August 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంనేపాల్‌లో జల ప్రళయం.. 675కి చేరిన మృతుల సంఖ్య‌

నేపాల్‌లో జల ప్రళయం.. 675కి చేరిన మృతుల సంఖ్య‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నేపాల్‌ లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలం చేస్తున్నాయి. భోటే కోశి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా సంభవించిన ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీయగా, మరో 2,498 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తు పర్యాటకులపైనా తీవ్ర ప్రభావం చూపింది. 589 మంది విదేశీయులతో సహా మొత్తం 753 మంది పర్యాటకులతో సంబంధాలు తెగిపోయినట్లు నేపాల్ పర్యాటక శాఖ నిన్న‌ సాయంత్రం ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -