- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ ఆరంభం కానుంది. రూ. కోటి నగదు బహుమతి కలిగిన ఈ టోర్నమెంట్లో 132 మంది క్రీడాకారులు పోటీపడుతున్నట్టు నిర్వాహకులు శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ ప్రతినిధులు గోల్కొండ మాస్టర్స్ ట్రోఫీని ఆవిష్కరించారు.
- Advertisement -



