- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ :మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఆదివారం థాయ్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్ చానెల్, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొమ్మిది సార్లు జరిగిన ఆసియాకప్లో భారత్ ఏడుసార్లు విజేతగా నిలిచింది. గాయం కారణంగా జెమీమా రోడ్రిగ్స్ దూరమవగా, ప్రతీకా రావల్ జట్టులోకి వచ్చారు. టోర్నీ ఆరంభ మ్యాచ్లో హాంకాంగ్పై విజయం సాధించిన థాయ్లాండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది.
- Advertisement -


