- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మాంసం ప్రియులకు షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. గత వారం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.200-240 ఉండగా, ఆదివారం నాటికి రూ.220-270కు చేరింది. నిజామాబాద్లో అత్యధికంగా రూ.270 పలకగా, వరంగల్, సూర్యాపేట, కామారెడ్డిలో రూ.250, ఖమ్మంలో రూ.220-240 వరకు విక్రయిస్తున్నారు. గుంటూరులో రూ.260, పల్నాడులో రూ.230-250, విశాఖలో రూ.240, చిత్తూరులో రూ.220 వరకు ధరలు నమోదయ్యాయి.
- Advertisement -



