- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఇండియా కూటమి నేతలతో సమావేశమై నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై చర్చించనున్నారు. జనాభా ప్రాతిపదికతో పాటు అభివృద్ధిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకంగా మారింది. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, అభివృద్ధి పనులపై కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
- Advertisement -



