- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలు, మహిళల సాధికారతకు అంబేద్కర్ నిరంతరం కృషి చేశారని, అణగారిన వర్గాల సంక్షేమం, హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని, ఆయన దార్శనికతతో రూపొందించిన రాజ్యాంగం భావి తరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనల నుంచి ప్రేరణ పొందిన తమ ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు.
- Advertisement -



