Wednesday, April 15, 2026
E-PAPER
Homeబీజినెస్హైదరాబాద్‌లో నూతన 'ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌'ను ప్రారంభించిన ఆసుస్

హైదరాబాద్‌లో నూతన ‘ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌’ను ప్రారంభించిన ఆసుస్

- Advertisement -

పాన్ఇండియా రిటైల్ వ్యూహాన్ని బలోపేతం చేసిన ASUS

నవతెలంగాణ హైదరాబాద్: దేశవ్యాప్తంగా తమ బ్రాండ్ రిటైల్ ఉనికిని బలోపేతం చేసే దిశగా ఒక ముందడుగు వేస్తూ, తైవాన్ టెక్ దిగ్గజం ‘ఆసుస్ ఇండియా’ ఈరోజు హైదరాబాద్‌లో తమ కొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. 335 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లో.. ఆసుస్ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తులైన వివోబుక్, జెన్‌బుక్, రిపబ్లిక్ ఆఫ్ గేమర్స్ ల్యాప్‌టాప్‌లు, గేమింగ్ డెస్క్‌టాప్‌లు, ఆల్-ఇన్-వన్ డెస్క్‌టాప్‌లు మరియు యాక్సెసరీస్‌తో సహా విస్తృత శ్రేణిలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నగరంలో ఇది ఈ బ్రాండ్‌కు చెందిన 9వ ఎక్స్‌క్లూజివ్ స్టోర్ కావడం విశేషం.

ఈ విస్తరణ గురించి ఆసుస్ ఇండియా పీసీ (PC) & గేమింగ్ బిజినెస్ నేషనల్ సేల్స్ మేనేజర్, జిగ్నేష్ భావ్సర్ మాట్లాడుతూ.. “భారతదేశంలో మా రిటైల్ ఉనికిని మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. తెలంగాణ మాకు అత్యంత కీలకమైన మార్కెట్. హైదరాబాద్ నగరంలో ఈ కొత్త బ్రాండ్ స్టోర్ ప్రారంభం ద్వారా.. మా సరికొత్త ఆవిష్కరణలను అద్భుతమైన అనుభూతితో వివిధ ప్రాంతాల వినియోగదారులకు అందించే దిశగా ఇది ఒక కీలక అడుగు కానుంది. వ్యూహాత్మక రిటైల్ విస్తరణ విధానంతో, మా వినియోగదారుల కోసం మరింత ఇంటరాక్షన్‌ను, కొత్త టచ్‌పాయింట్‌లను సృష్టించడాన్ని మేము నిరంతరం కొనసాగిస్తాము,” అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -