Wednesday, April 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర స్థాయి ర్యాంకుల విద్యార్థులకు సన్మానం 

రాష్ట్ర స్థాయి ర్యాంకుల విద్యార్థులకు సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి 
రాష్ట్ర స్థాయి 2వ ర్యాంకు ఉమ్మడి జిల్లా 1వ ర్యాంకును సాధించిన జాగృతి విద్యార్థులను మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఐ పి ఈ  2026 ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలలో పట్టణంలోని జాగృతి కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో I BiPC లో ఉజ్మా హజారా 438/440 మార్కులతో 2వ ర్యాంకును, అదే విధంగా II BiPC లో H.అనుష్ణ 994/1000 మార్కులతో ఉమ్మడిజిల్లా 1st ర్యాంకును సాధించి మరొకసారి వనపర్తిలో ప్రతిభ చాటారు, ఈ విషయాన్ని తెలుసుకున్న మాజి మంత్రి నిరంజన్ రెడ్డి గారు జాగృతి కళాశాలకు వచ్చి స్టేట్ ర్యాంకర్లను ఘనంగా సన్మానించారు. 

ఈ సంధర్భంగా మాజి మంత్రి గారు మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో కార్పొరేట్ స్థాయి మార్కులతో , STATE ర్యాంకులను మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఫస్ట్ ర్యాంకులను సాధిస్తూ ఉమ్మడి జిల్లాలో అద్బుతమైన ఫలితాలు సాధిస్తున్నందుకు జాగృతి కళాశాల విద్యార్థులను అభినందించారు.

అదే విధంగా JEE mains-2026 Session-I ఫలితాలలో CH.అర్జున్ 91.69 percentile తో జిల్లాలో అగ్రగామిగా నిలవడం జరిగింది అని కొనియాడారు జిల్లాలో ఇంటర్ విద్యలో IPE మార్కులతో పాటు JEE, NEET, EAPCET లలో కూడా కార్పొరేట్ కళాశాలలకు దీటుగా జాగృతి కళాశాల నిలవడం ఎంతో సంతోషంగా ఉంది అని జాగృతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంబటి వినోద్ కుమార్ గారిని యజమాన్య సభ్యులు భాస్కర్ గారు, శ్యామ్ కుమార్ గారు , సత్యనారాయణ గారు ప్రత్యేకంగా అభినందించారు.  

ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ గారు, వాకిటి శ్రీధర్ గారు, ప్రేమ్ నాథ్ రెడ్డి గారు, భాగ్యరాజు గారు, హేమంత్ గారు తదితర నాయకులు, యజమాన్య సభ్యులు, అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -