- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ఎటుచూసినా విధ్వంసం, వికృతమే కనిపిస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో వైఫల్యాలపై బీఆర్ఎస్ ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయకున్నా 4.50లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చిందన్నారు. కేసీఆర్ తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మారిస్తే.. కాంగ్రెస్ నాశనం చేసిందని విమర్శించారు.
- Advertisement -


