నవతెలంగాణ – హైదరాబాద్ : టెక్ దిగ్గజం ఆపిల్లో ఒక శకం ముగిసింది. 15 ఏళ్లుగా కంపెనీ సీఈవోగా వ్యవహరిస్తున్న టిమ్ కుక్ తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టు సంస్థ ప్రకటించింది. ఆయన స్థానంలో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా (సీఈవో) జాన్ టెర్నస్ను నియమించింది. ఈ మార్పులు ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. సీఈవో పదవి నుంచి వైదొలగినప్పటికీ, టిమ్ కుక్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా సేవలు అందించనున్నారు. 50 ఏళ్ల జాన్ టెర్నస్ గత 25 ఏళ్లుగా ఆపిల్తో అనుబంధం కలిగి ఉన్నారు. 2001లో కంపెనీలో చేరిన ఆయన, ప్రస్తుతం హార్డ్వేర్ ఇంజినీరింగ్ విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. మ్యాక్స్, ఐప్యాడ్స్, ఎయిర్పాడ్స్ వంటి విజయవంతమైన ఉత్పత్తుల రూపకల్పనలో టెర్నస్ తెరవెనుక కీలక పాత్ర పోషించారు.
యాపిల్ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



