- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్లోని దాహోద్ జిల్లా అబ్లోద్ గ్రామంలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి విందులో భోజనం తిని 400 మందికి పైగా అతిథులు అస్వస్థతకు గురవ్వడంతో భయాందోళనలు, గందరగోళం నెలకొంది.ఇది అదిపెద్ద ఫుడ్ పాయిజనింగ్ కేసుగా అధికారులు అనుమానిస్తున్నారు. బాధితులను చికిత్సకోసం హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు అయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
- Advertisement -



