- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో వాతావరణం మార్పులతో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
- Advertisement -



