- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి, వితంతు మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న చేయూత పింఛన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక సడలింపులు చేసింది. అధికారిక పత్రాలు లేనివారికి ఊరటనిస్తూ, దరఖాస్తు సమయంలో ఆదాయ, వయోపరిమితి, వైకల్య ధ్రువీకరణ పత్రాలు వెంటనే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని, క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో సమర్పిస్తే సరిపోతుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది అర్హులకు పింఛన్ పొందే అవకాశం లభిస్తుంది.
- Advertisement -



