- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు జారీ చేసింది. మార్చి 29న అసెంబ్లీ సమావేశాల్లో కడియం శ్రీహరిని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. తనపై వచ్చిన ఆరోపణలపై రాతపూర్వక సమాధానం ఇవ్వాలని, నిర్ణీత గడువులోపు స్పందించాలని కమిటీ ఆదేశించినట్లు సమాచారం.
- Advertisement -



