- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి ఎన్ఓసీ (అభ్యంతర ధృవీకరణ) కోరారు. ప్రాజెక్టు వల్ల ముంపునకు గురయ్యే బాధితులకు పూర్తి పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే, పరిహార నిధులను ముందుగానే జమ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ తెలిపారు.
- Advertisement -



