- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని కేపీహెచ్బీ కాలనీలో ఓ ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులను కిందికి దించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
- Advertisement -



