- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జలసంధిపై మాట మార్చడం ద్వారా తమను బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించొద్దని హెచ్చరించారు. వైట్హౌస్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్తో సంప్రదింపులు కొనసాగిస్తూనే ఉన్నామన్నారు. ఈ క్రమంలోనే జలసంధిని మళ్లీ మూసివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఏళ్లుగా ఇదే తంతు జరుగుతోందని.. కానీ, తమను బ్లాక్మెయిల్ చేయలేరని ట్రంప్ స్పష్టం చేశారు.
- Advertisement -



