- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’ . టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. ఆర్నాల్డ్ వోస్లూ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర టీజర్ విడుదలైంది. 1854 – 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దుతున్నారు.
- Advertisement -



