- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో పుతిన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన రంగాల్లో సహకారంపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం. పుతిన్కు కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. 2022లో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా వెలుపల పుతిన్ స్వయంగా హాజరవుతున్న తొలి బ్రిక్స్ సదస్సు ఇదే కావడం ఇదే.
- Advertisement -



