Tuesday, April 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జనగణనపై ఎన్యుమరేటర్స్ మొదటి విడత శిక్షణ పూర్తి

జనగణనపై ఎన్యుమరేటర్స్ మొదటి విడత శిక్షణ పూర్తి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
జనగణన 2027 పేస్-1జనాభా లెక్కలకు 27 మంది సభ్యులతో కూడిన బ్యాచ్-1 ఎన్యుమరేటర్స్,సూపర్ వైజర్స్ మూడురోజుల శిక్షణ తరగతులు మండల పరిషత్ తాడిచెర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో మంగళవారం ముగిశాయి. ఈ శిక్షణ తరగతులు మండల తహశీల్దార్ రవికుమార్, ఏఎస్ఓ శివ పర్యవేక్షణలో కొనసాగాయి. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు అందరినీ రెండు బ్యాచ్ లు గా విభజించి మొదటి విడత 27 మందికీ ట్రైనింగ్ ఆఫీసర్లుగా జిల్లా పరిషత్ తాడిచర్ల పాఠశాల నుండి కోడెపాక రమేష్, వెలిశాల జిల్లా పరిషత్ పాఠశాల నుండి పి.సునీల్ ట్రైనర్లకు నాణ్యమైన ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందించడం జరిగిందని తెలిపారు. చివరి తహసీల్దార్ హాజరై మాట్లాడారు. జనగణన విజయవంతంగా చేయాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఖచ్చితమైనటువంటి రిపోర్టు అందించాలని కోరారు. జిల్లాలోనే మండలంలో నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ఎన్యుమరేటర్, సూపర్వైజర్లకు జనగణన చేయడానికి అవసరమైన వస్తువులతో కూడిన కిట్స్ అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -