- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలోని స్వరూప్ నగర్లో ఒక రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని భవనాలను ఖాళీ చేయించారు. ఘటనా స్థలానికి డజన్ల కొద్దీ అగ్నిమాపక వాహనాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



