- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మొదలైన ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిణామాలతో పాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది . కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు, ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రభుత్వంలో విలీనం అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.
- Advertisement -


