Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ విద్యార్థులకు ప్రగతి పత్రాలు పంపిణీ

ప్రభుత్వ విద్యార్థులకు ప్రగతి పత్రాలు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామ పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పాఠశాలలోని విద్యార్థులకు ప్రగతి పత్రాలను గురువారం పంపిణీ చేసినట్లుగా పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పాఠశాల పనిదినం చివరి రోజు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశము నిర్వహించి విద్యార్థులకు ప్రగతి పత్రాలను అందించడం జరిగిందన్నారు.విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు వివరించి,వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లుగా తెలిపారు.

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నమోదును పెంచవలసిందిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ పాఠశాలలో ఉన్నటువంటి సదుపాయాలను తల్లిదండ్రులకు తెలియజేశారు.ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులను చేర్పించి,ఆర్థికంగా నష్టపోకూడదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -