- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
గురువారం మద్నూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి జాతీయ జెండాను ఎగరవేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట తహశీల్దార్ ఎండి.ముజీబ్ జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది. కార్యక్రమాల్లో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
- Advertisement -



