- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జపాన్లో ఆసియా క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత ఫ్లాగ్-బేరర్గా తొలుత షాట్పుటర్ తజిందర్పాల్ సింగ్ తూర్ ఎంపికైనప్పటికీ, కిట్ ఆలస్యం కారణంగా కబడ్డీ ప్లేయర్ పవన్ సహ్రావత్ ఆ బాధ్యతను స్వీకరించారు. కిట్ అందకపోవడంతో తజిందర్పాల్ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయారు. భారత బృందానికి పవన్, మనుబాకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 11 వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 158 మంది సభ్యులతో కూడిన భారత బృందం పోటీల్లో పాల్గొంటుంది.
- Advertisement -



