- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఆసియా గేమ్స్ సెమీఫైనల్లో భాగంగా భారత మహిళల క్రికెట్ జట్టు ఆదివారం బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఈరోజు ఉదయం 10.30 గంటలకు ప్రారంభంకానుంది. తొలి సెమీఫైనల్ ఇవాళ ఉదయం 5.30 గంటలకు పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరగనుంది. ఈ మ్యాచ్లలో గెలిచిన జట్లు 22న గోల్డ్ మెడల్ కోసం ఫైనల్లో పోటీపడతాయి. ఓడిన జట్లు కాంస్య పతకం కోసం ఆడతాయి. పురుషులు, మహిళల హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, MMA, వుషు, టెక్బాల్, సెపక్ తక్రా క్రీడల్లో కూడా భారత క్రీడాకారులు నేడు పోటీల్లో పాల్గొంటారు.
- Advertisement -



