నవతెలంగాణ-హైదరాబాద్: కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురైన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరో వివాదానికి తెరలేపారు. లైంగిక దాడి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన మరోసారి విమర్శల పాలయ్యారు.
ఇటీవల ఖాండ్వాలో లైంగిక దాడికి గురైన బాధిత కుటుంబాన్ని మంత్రి విజయ్ షా పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ.. నాయకులను, పార్టీ కార్యకర్తలను వెంట వేసుకుని వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తీసిన ఫొటోలను కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి వివాదానికి తెరలేపింది. గోపత్యాను మంత్రి ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.