Wednesday, June 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్ డెంటల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం..

హైదరాబాద్ డెంటల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం..

- Advertisement -

12 మంది విద్యార్థులపై కేసు
నవతెలంగాణ – హైదరాబాద్:
హైదరాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. తమ జూనియర్ విద్యార్థులను వేధించారనే ఆరోపణలపై 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో నగరంలోని విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు ప్రస్తుతం బస చేస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటి సంవత్సరం బీడీఎస్ విద్యార్థులను సీనియర్లు శారీరకంగా, మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు 12 మంది విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం తక్షణ క్రమశిక్షణా చర్యలు చేపట్టింది. విచారణ పెండింగ్‌లో ఉండగానే, ఆరుగురు ఫైనల్ ఇయర్ విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో మరింత మంది విద్యార్థుల ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -