- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సెక్రటేరియట్లోని క్యాబినెట్ హాల్ దగ్గర మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఆమె సిబ్బంది వైద్యులకు సమాచారం ఇచ్చారు. పరీక్షల అనంతరం ఆమె మంత్రి సురేఖ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. లోబీపీ కారణంగా కళ్లు తిరిగి ఉంటాయని వైద్యులు చెప్పారు. ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్లు, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు.
- Advertisement -