– రాష్ట్రంలో పలుచోట్ల కీలక ఖనిజాలు లభ్యం
– వెలికితీసేందుకు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో కలిసి పనిచేస్తాం
– ఖమ్మం జిల్లా కల్లూరు అటవీప్రాంతంలో కీలక ఖనిజాలు
– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిత్వ శాఖ సదస్సులో సింగరేణి సీఎమ్డీ ఎన్ బలరాం వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దేశ అవసరాలు, వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి స్వయంగా లేదా ఇతర సంస్థలతో జాయింట్ వెంచర్గా ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నామని సింగరేణి కాలరీస్ సీఎమ్డీ ఎన్ బలరామ్ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థా యి కీలక ఖనిజాల సదస్సులో ఆయన మాట్లాడా రు. సింగరేణి గనుల్లోని బొగ్గు మరియు మట్టి పొరల్లో ఆర్ఈఈ (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) ఉన్నట్టు పలు ప్రాథమిక అధ్యయనాల్లో వెల్లడైందనీ, వీటి నుంచి కీలక ఖనిజాల ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా విడుదలవుతున్న ఫ్లై యాష్ను భువనేశ్వర్లోని ఐఎమ్ఎమ్టీ లేబరేటరీల్లో పరిశీలన జరపగా ఆర్ఈఈ ఎలిమెంట్స్ ఉన్నట్టు నిర్ధారించారన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో కూడా కీలక ఖనిజాలు, ఆర్ఈఈ ఉనిక ిని గుర్తించినట్టు తెలిపారు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ మరియు నియోబియం ఖనిజాలకు కార్బోనైట్రేట్స్ ప్రధాన ఆధారాలుగా ఉన్నాయని చెప్పారు. రామగుండం ఓపెన్ కాస్ట్ రెండో గనిలో, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఫ్లై యాష్, బాటమ్ యాష్లో లైట్ అండ్ హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కనుగొన్నాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా సీరియం, లాంతనం, నియో డిమియం, ప్రెసియో డిమీయం, గాడోలినియం, డిస్పోజియం, ల్యూటేటియం వంటి 14 రకాల ఎలిమెంట్ల ఉనికిని గుర్తించినట్టు వెల్లడించారు. హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జరిపిన పరిశోధనల్లో కూడా రామగుండం ఓపెన్ కాస్ట్-2 గనిలో వెనాడియం, స్ట్రాంటియం, జిర్కోనియం కనుగొనబడిందన్నారు. కీలక ఖనిజాల ఉత్పత్తి రంగంలోకి అడుగు పెట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కీలక ఖనిజాల ఉనికిని కనుగొనడం, విశ్లేషణ జరపడం కోసం త్వరలోనే జియో సైన్స్ లేబరేటరీని సింగరేణి ఆధ్వర్యంలో నెలకొల్పుతామ న్నారు. ఎన్ఎమ్డీసీ సహా పలు సంస్థలతో ఇప్పటికే చర్చలు జరిపామనీ, ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో కీలక ఖనిజాల ఉత్పత్తికి ఉమ్మడిగా పాల్గొనే విషయంపై చర్చించామన్నారు. కీలక ఖనిజాల రంగంలో దేశ స్వయంసమృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలతో కలిసి పనిచేయడానికి, జాయింట్ వెంచర్లుగా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దీనికోసం సలహాలు, సంప్రదింపుల కోసం డెలాయిట్ సంస్థను కన్సల్టెంట్గా నియమించుకున్నామనీ, కేంద్ర ప్రభుత్వం నిర్వహించబోయే కీలక ఖనిజాల వేలంలోనూ పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి మాట్లాడుతూ దేశంలో కీలక ఖనిజాల స్వయం సమృద్ధి ప్రాధాన్యతను వివరించారు.
కీలక ఖనిజాల ఉత్పత్తికి సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES