లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న డీసీపీ

నవతెలంగాణ – భీంగల్
మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్టపై గల లక్ష్మీనరసింహస్వామిని డీసీపీ జయరాం సతీ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు  గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను గురించి డిసిపి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ అర్చకుడు నంబి పార్థసారథి డీసీపీను సన్మానించారు. డీసీపీ వెంట భీంగల్ ఎస్సై హరి బాబు ఉన్నారు.
Spread the love