నవతెలంగాణ – హైదరాబాద్; భారత క్రికెట్ జట్టు టీ20 స్పెషలిస్ట్, కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) స్టార్ బ్యాటర్ రింకూ సింగ్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్ ఒక కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఆదివారం (జూన్ 8) నాడు లక్నోలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ జంట ఈ ఏడాది నవంబర్ 18న వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆయన అర్ధాంగి, ఎంపీ డింపుల్ యాదవ్, ప్రముఖ నటి ఎంపీ జయా బచ్చన్ తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి సందడి చేశారు. కాంగ్రెస్ నాయకుడు, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇద్దరూ తమ తమ రంగాల్లో రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి విజయవంతమైన, బలమైన జంటగా నిలుస్తారు. వారిద్దరికీ ఆనందకరమైన జీవితం లభించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఎంపీతో నిశ్చితార్థం చేసుకున్న క్రికెటర్ రింకూ సింగ్
- Advertisement -
- Advertisement -