Monday, June 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమోడీ హయాంలో రాజ్యాంగ సంస్థల ‘హైజాక్‌’

మోడీ హయాంలో రాజ్యాంగ సంస్థల ‘హైజాక్‌’

- Advertisement -

నవతెలంగాణ – పాట్నా :  ప్రధాని మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగ సంస్థలు హైజాక్‌ అయ్యాయని ఆర్‌జెడి నేత తేజస్వీయాదవ్‌ ఆదివారం వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల సంఘం (ఇసి) వంటి రాజ్యాంగ సంస్థలను హైజాక్‌ చేస్తోందని, ఎన్నికల తేదీలు ప్రకటించకముందే అధికారిక బిజెపి ఎన్నికల షెడ్యూల్‌ గురించి ఎలా తెలుసుకుంటుందని అన్నారు. ”2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని రాజ్యాంగ సంస్థలు హైజాక్‌కు గురయ్యాయి. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు. ఎన్నికల తేదీలను ఇసి ప్రకటించడడానికి ముందే బిజెపి ఐటి సెల్‌ తెలుసుకుంటోంది. ఇలా చాలా పరిణామాలను గమనించాము” అని అన్నారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరం ఉందని, వాటిపై ప్రభావం పడితే ప్రజలు ఎలా న్యాయం ఆశించగలరని ప్రశ్నించారు. 2020లో చివరిసారి జరిగిన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, న్యాయంగా జరగలేదని ఉద్ఘాటించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏంజరిగిందో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వుందని అన్నారు. కానీ సాయంత్రానికి ఓట్ల లెక్కింపు ఆగిపోయిందని, సమర్థించుకునేందుకు ఇసి మూడు మీడియా సమావేశాలను నిర్వహించిందని అన్నారు. అయితే రాత్రిపూట తిరిగి లెక్కింపు ఎందుకు ప్రారంభించారని, విజేతలుగా ప్రకటించబడిన మహాఘట్బంధన్‌ అభ్యర్థులు తరువాత ఓడిపోయినట్లుగా వెల్లడించారని, వీటికి ఇసి సమాధానమివ్వాల్సి వుందని తేజస్వీయాదవ్‌ పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర ఎన్నికలపై ఇండియా బ్లాక్‌ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -