- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే రెండ్రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 48 గంటల్లో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో వర్షాలు కురిసే ఆస్కారముందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
- Advertisement -



