గ్రీవెన్స్ డే లో వినతి పత్రం అందజేత
యూత్ అధ్యక్షులు తడక సాయికుమార్
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామంలోని పశు వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరిందని, నూతన భవనం నిర్మించి, వైద్యులను అందుబాటులో ఉంచాలని, కాటాపూర్ యూత్ అధ్యక్షులు తడక సాయికిరణ్ అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే లో జిల్లా పశువైద్యాధికారికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ కాటాపూర్ దాని పరిసర గ్రామపంచాయతీలు అయిన పంబాపూర్ దామరవాయి గంగారం నర్సాపూర్ బీరెల్లి రంగాపూర్ ఐదు గ్రామపంచాయతీల పశువులకు ప్రాణదానమైన పశువైద్యశాల పూర్తిగా శిథిలమైందని ఆవేదన చెందారు. వేలాది పశువులు సీజనల్ వ్యాధులు, గాలికుంటు వ్యాధి, జబ్బ వాపు వ్యాధులకు టీకాలు వేయడానికి కూడా ఎవరూ లేరని పశువులు వేలాదిగా చనిపోతున్నాయని అన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి కాటాపూర్లో పశు వైద్యశాల నూతన భవనాన్ని నిర్మించి, పశువైద్యాధికారిని, పశువుల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు.
కాటాపూర్ లో నూతన పశు వైద్యశాలను నిర్మించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES