సీసీరోడ్డు పనులకు భూమి పూజ చేసిన చిన్నారెడ్డి

నవతెలంగాణ – జక్రాన్ పల్లి

జాతీయ ఉపాధి హామీ ద్వారా మంజూరైన సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే  శ్రీ డా ఆర్. భూపతిరెడ్డి సహకారంతో మండలంలోని  చింతలూర్ గ్రామ అభివృద్ధికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం వలన  చింతలూర్ గ్రామంలో  5 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది. గెలిచినా అనతి కాలంలోనే గ్రామ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే కి గ్రామ నాయకులు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో    కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Spread the love