ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. అద్భుతమైన తారాగణంతో ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్గా నిలవబోతోంది. ఈ మూవీ ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా నాగార్జున ఈ చిత్రానికి సంబంధించి తన డబ్బింగ్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో నాగార్జున, శేఖర్ కమ్ముల, నిర్మాత పుష్కర్ రామోహన్ కలసి మాట్లాడుతున్న ఫోటోలని మేకర్స్ షేర్ చేశారు. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
‘పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్తో మ్యూజిక్ చార్ట్స్లో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. క్యారెక్టర్ బేస్డ్ నెరేటివ్స్తో అదరగొట్టే శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్గా తీర్చిదిద్దారు, శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్విఎల్సిసి పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వ్యాల్యూస్తో నిర్మిస్తున్నారు.
‘కుబేర’పై భారీ అంచనాలు
- Advertisement -
- Advertisement -