బహుళజాతి సంస్థలకు కేంద్రం దన్ను
ఓఈసీడీ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ సాయం
తనకేం తెలీదన్న వ్యవసాయ శాఖ మంత్రి
రహస్యంగా ఓఈసీడీ భేటీ
అంతా తానై వ్యవహరిస్తున్న ఓ ఉన్నతాధికారి
రైెతు ప్రయోజనాలను ఫణంగా పెడుతున్న వైనం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
స్థానిక విత్తనానికి విపత్తు రాబోతున్నదా? బహుళజాతి విత్తన సంస్థలు తెలంగాణలో పాగా వేయబోతు న్నాయా? మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన కేంద్రం… దొడ్డిదారిలో మళ్లీ దేశానికి ఆయా సంస్థలను ఆహ్వానిస్తున్నదా? అందులో భాగంగానే హైదరాబాద్లో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్స్ అండ్ కో ఆపరేషన్ డెవలప్మెంట్(ఓఈసీడీ) సమావేశాలు జరుగుతు న్నాయా? రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కూడా తెలియకుండా ఈ సమా వేశాలు జరుగుతున్నాయా? అంటే అవుననే అంటు న్నారు వ్యవసాయ అధికారులు. ఐరోపా దేశాల కూటమి విభాగమైన ఓఈసీడీ సమావేశాలు హైదరాబాద్లో రహస్యంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో విత్తన ధ్రువీకరణ సర్టిఫికెట్ ను ఈ సంస్థ జారీ చేస్తుంది. దాని వార్షిక బడ్టెట్ రూ. 7వేల కోట్లు. అలాంటి ప్రయివేటు వ్యాపార సంస్థ సమావేశాలు ఈ ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమవుతున్నాయి. పది రోజులపాటు కొనసాగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశాలకు విలాసవంతమైన హోటళ్లలో ఆతిధ్యమిస్తున్నది. అందుకు కావాల్సిన ఆర్థిక వనరులను కూడా సర్కారే సమకూర్చడం గమనార్హం. తమ విత్తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగా ఆయా దేశాల్లో కంపెనీలు ఈ సమావేశాలను నిర్వహిస్తుంటాయి. స్థానిక విత్తనాలను దెబ్బ తీయడం, కార్పొరేట్ల కబంధ హస్తాల్లోకి విత్తనాలను తీసుకొచ్చే ప్రక్రియపై ఆ సమావేశాల్లో చర్చిస్తారు. అయితే ఈ సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలపై రైతాంగం తిరుగుబాటు చేసి వాటిని వెనక్కి కొట్టింది. ఆ చట్టాలు ఎంత ప్రమాదకరమో దేశానికి ఈ ఉద్యమంతో తెలిసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాల నుంచి వెనక్కి తగ్గినట్టు కనిపించినా, ఇతర పద్ధతుల్లో వాటిని అమలు చేసేందుకు బహుళజాతి విత్తన సంస్థలను ఆహ్వానిస్తుందనే విమర్శలొస్తున్నాయి. రాష్ట్రంలో విత్తనంపై కార్పొరేట్ల పెత్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఓఈసీడీ సమావేశాలు అందుకు మరింత ఊతమిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని విత్తన రైతులకు ఆదరణ కరువైంది. రైతులను సర్కార్ ఆదుకోవడం లేదు. దాంతో వారు అన్ని విత్తనాలను మార్కెట్లలో కొనాల్సి వస్తుంది. విత్తనాల డిమాండ్ను ఆసరా చేసుకుని బహుళ జాతి కంపెనీలు అధిక ధరలకు విత్తనాలను అమ్ముకుంటూ వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. వారు సరఫరా చేసిన విత్తనాలతో నష్టపోతే రైతుకు పరిహారం చెల్లించడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బహుళజాతి సంస్థలకు అండగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే రైతులపై సాగు భారం పెరిగి అప్పుల పాలవుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోతే పరిహారం అందడం లేదు. విత్తన మార్కెట్ ను బహుళజాతి సంస్థలు కమ్మేస్తే సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితులు దాపురిం చడం ఖాయం. రాష్ట్ర ప్రయో జనాలకు భిన్నంగా జరుగుతున్న ఈ సమావేశాలు గురించి వ్యవసాయ శాఖ మంత్రికి కూడా తెలియదని సచివాలయ వర్గాలు చెప్పాయి. అయితే విత్తనాభివృద్ధి సంస్థే ఓఈసీడీ సమావేశాలకు రెడ్ కార్పెట్ వేసిందన్న ఆరో పణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంస్థ ఉన్న తాధికారి వ్యక్తిగతంగా తన ప్రతిష్టను పెంచుకు నేందుకు ఇలాంటి రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే టాక్ కూడా వినిపిస్తున్నది. ప్రయివేటు వ్యాపారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
విత్తనానికి విపత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES