– మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య
నవతెలంగాణ-నల్లబెల్లి
కులం పేరుతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టు కర్రతో కొట్టడంతో మనస్తాపానికి గురైన బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని కొండాపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొండాపురం గ్రామానికి చెందిన ఒక మహిళ మేకను కోయడానికి జల్లి శ్రీకాంత్, పత్రి అశోక్లను పిలిచింది. వారు మేకను కోసి చేతులకు అంటిన రక్తాన్ని నీటి తొట్టిలో కడుక్కున్నారు. దీంతో జల్లి శ్రీకాంత్(14)ను ఆ మహిళ బూతులు తిడుతూ, కులం పేరుతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్టుగా కర్రతో కొట్టింది. మనస్తాపం చెందిన ఆ బాలుడు ఇంట్లో ఉన్న గుర్తుతెలియని పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాలుడి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి, ఇద్దరు అక్కలు ఉన్నారు. తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కోల కొమరమ్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.
కులం పేరుతో దూషణ
- Advertisement -
- Advertisement -