Tuesday, June 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరికార్డ్‌ స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు

రికార్డ్‌ స్థాయిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు

- Advertisement -

– 8,378 కేంద్రాల ద్వారా 72 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరణ
– 2023తో పోలిస్తే 13 లక్షల మెట్రిక్‌ టన్నులు అధికం
– 12.33 లక్షల మంది రైతులకు రూ.15,121 కోట్ల చెల్లింపులు : మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదు చేసుకుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ పాలనతో పోల్చుకుంటే సరిగ్గా జూన్‌ 8 నాటికి అధికంగా 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంపై సంబంధిత అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. బీఆర్‌ఎస్‌ పాలన చివరి రోజుల్లో జూన్‌ 8 నాటికి నాటి ప్రభుత్వం 59 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే రోజు నాటికి 72 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అన్నారు. వానాకాలం సీజన్‌లో రికార్డు స్థాయిలో దిగుబడి అయిన ధాన్యాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాగైన విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు చెప్పారు. అదనంగా 1,344 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా వ్యవహరించి కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని ఆయన తెలిపారు.
ధాన్యం కొనుగోలు చేసిన 12.33 లక్షల మంది రైతులకు ప్రస్తుత ప్రభుత్వం రూ.15,121 కోట్లను చెల్లించినట్టు తెలిపారు. అదే గత యాసంగి సీజన్‌లో అప్పటి ప్రభుత్వం 9.81 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.5,982 కోట్లు మాత్రమే చెల్లించిందని గుర్తు చేశారు. చెల్లింపులో కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో యాసంగి సీజన్‌లో జూన్‌ 8 నాటికి కొనుగోలు చేసిన ధాన్యానికీ ప్రస్తుత ప్రభుత్వం రూ.9,139 కోట్లు అధికంగా చెల్లించిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలకులు గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం నిరుపయోగంగా మారినా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరించిన విధానాలతో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి చేసుకోవడం వ్యవసాయ చరిత్రలోనే చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అభివర్ణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -