– సహనం నశించిన రైతు
– నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట
– వరి బస్తాలను దహనం చేసే యత్నం
– పోలీసుల అడ్డగింత..బుజ్జగింపు
నవతెలంగాణ -నర్సంపేట
ధాన్యం కొనుగోలు చేయడానికి నిరాకరించడంతో రైతు ఆగ్రహం చెందాడు.. ఏకంగా ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసి ధాన్యం దహనం చేసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డగించారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జోజిపేట గ్రామానికి చెందిన లూనావత్ భద్రు అనే రైతు తనకున్న రెండు ఎకరాలతో పాటు మరో 13ఎకరాలను కౌలుకు తీసుకొని యాసంగిలో ధాన్యం పండించాడు. పది రోజుల క్రితం గ్రామంలో పీఏసీఎస్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం వద్దకు ధాన్యాన్ని తరలించారు. ధాన్యం కొనుగోలు చేయడానికి పలుమార్లు అధికారులు సెంటర్ వద్ద నిరాకరించారు. ఈ విషయంపై ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని రైతు భద్రు చెప్పాడు. ఎమ్మెల్యే స్పందించి వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారని, అయినా అధికారులు పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. సహనం కోల్పోయిన రైతు సోమవారం నర్సంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు ట్రాక్టర్లో ధాన్యం బస్తాలను తీసుకెళ్లి దహనం చేసేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. దహనం చేయవద్దని రైతును బుజ్జగిం చారు. కొనుగోలు కేంద్రం బాధ్యులతో మాట్లాడారు. ధాన్యం కొను గోలు చేయడానికి చివరికి అంగీకరించడంతో రైతు శాంతించాడు. కాగా గంట పాటు క్యాంపు కార్యాలయం ఎదుట స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. చివరికి సర్వాపురంలోని ఎంజే ఆర్ రైస్ మిల్ వద్దకు రైతుకు చెందిన ధాన్యాన్ని తరలించారు. 900 బస్తాలు ధాన్యం దిగుబడి వచ్చిందని రైతు తెలిపారు.
ధాన్యం కొనుగోలుకు నిరాకరణ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES