Monday, June 23, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్ ఆయుధాలు..ఉగ్ర‌వాదుల చేత‌లోకి వెళ్లాయి: బిలావల్ భుట్టో

యూఎస్ ఆయుధాలు..ఉగ్ర‌వాదుల చేత‌లోకి వెళ్లాయి: బిలావల్ భుట్టో

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ఇండియా చేప‌ట్టే ప్ర‌తి చర్య‌ను పాకిస్థాన్ దేశం కాపీ పేస్ట్ చేసింది. భారత్ త‌ర‌హాలోనే పాక్ కూడా బిలావల్ భుట్టో ఆధ్వ‌ర్యంలో ఎంపీల బృందాన్ని విదేశాల‌కు పంపిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ బృందం యూఎస్ ప‌ర్య‌టిస్తుంది. ఈక్ర‌మంలో అమెరికాపై పాకిస్థాన్ నేత బిలావల్ భుట్టో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా దళాలు కాబూల్‌ నిష్క్రమణ సమయంలో అఫ్గాన్‌లో వదిలిపెట్టిన మిలిటరీ ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా తయారుచేసిన ఎం117 సాయుధ వాహనాలు, ఎం-17 హెలికాప్టర్లు, ఎం4 అసాల్ట్‌ తుపాకులు, 2.5 లక్షలకుపైగా రైఫిళ్లు, చీకట్లో వీక్షణకు ఉపయోగించే 18వేల నైట్‌ విజన్‌ గాగుల్స్‌ వంటి అధునాతనమైన ఆయుధాలతో ముష్కరులు దాడులకు పాల్పడుతుండడంతో వారిని ఎదుర్కోవడం తమ దేశంలోని పోలీసులకు పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ఆ ఆయుధాలు వారి వద్ద ఉండడం వల్లే ప్రస్తుతం పాక్‌ ఇబ్బందులు పడుతోందని వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -