- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వెనిజులాలో భూకంపంలో మృతుల సంఖ్య 589కి పెరిగింది. గాయపడిన వారి సంఖ్య 3 వేలకు చేరింది. ఈమేరకు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వివరాలు వెల్లడించారు. అత్యంత తీవ్రంగా దెబ్బతిన్న లా గువేరా ప్రావిన్స్లో సహాయక చర్యల కోసం సైనికులను మోహరిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని ప్రభుత్వం అంచనా వేసింది. గల్లంతైన వారి వివరాలను స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన వెబ్సైట్లో శుక్రవారం ఉదయం నాటికి 50 వేల మంది పేర్లు నమోదయ్యాయి.
- Advertisement -



