- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిందనౌ ప్రాంతాన్ని శుక్రవారం 6.5 తీవ్రతతో కూడిన భారీ భూకంపం వణికించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం, భూకంపం 29 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు తెలుస్తోంది. అధికారులు ప్రభావిత తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి తక్షణమే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
- Advertisement -



