నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)కు చెందిన బస్సు, ఒక లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మృతులు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు. వీరిలో కేశవ రెడ్డి (44), తులసి (21), నాలుగేళ్ల చిన్నారి ప్రణతి, ఏడాది పసికందు మరియా ఉన్నారు. బెంగళూరు నగర శివార్లలోని హోస్కోటే తాలూకా, గొట్టిపుర గేట్ వద్ద కోలార్-హోస్కోటే జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తిరుపతి నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు, అదే మార్గంలో వెళ్తున్న ఒక లారీని అధిగమించే ప్రయత్నంలో అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హోస్కోటేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES