- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలోని టోల్ ప్లాజా సమీపంలో 44వ జాతీయ రహదారి పై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న లారీని వెనుక నుండి అతివేగంగా వస్తున్న డీసీఎం లారీని ఢీకొట్టడంతో డీసీఎం డ్రైవర్ అందులోనే ఇరుక్కుపోయి తీవ్ర గాయాలయ్యాయి. టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు డ్రైవర్ ని బయటకు తీసి జిఎంఆర్ అంబులెన్స్ లో కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.
- Advertisement -