నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని దోస్పల్లి గ్రామంలో శుక్రవారం నాడు మొదటి రోజు పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా అమ్మబడి కార్యక్రమంలో హెచ్ఎం శంకర్ ఆధ్వర్యంలో అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా జుక్కల్ ఎంఈఓ చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జుక్కల్ ఎంఈఓ తిరుపతయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ తిరుపతయ్య , దోస్పల్లి ప్రభుత్వ ఎంపీపీ ఎస్ పాఠశాల హెచ్ఎం శంకర్ మాట్లాడుతూ ఈ ఏడాది నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రత్యేకంగా పువ్వులు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలికి వారిని స్వాగతించడం జరిగింది. సంతోషకరమైన వాతావరణము పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశాము అని తెలిపారు. అమ్మబడి కార్యక్రమంలో గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వాములయ్యారు . నేటి కార్యక్రమంలో విద్యార్థులకు ఉల్లాసంగా , ఉత్సాహంగా , సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు . పాఠశాల ఆవరణలో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు . అంతకుముందు పాఠశాల విద్యార్థులకు ఎంఈఓ తిరుపతయ్య విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు . ఈ కార్యక్రమంలో ఎంఈఓ , హెచ్ఎం , గ్రామ పెద్దలు , విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
దోస్పల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES