Sunday, June 15, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని సీఎంకు వినతి

అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని సీఎంకు వినతి

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్
ముధోల్ నియోజక వర్గంలో పెండింగ్లో ఉన్న పనులకు కొత్తగా నిధులు మంజూరు చేయాలని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి శనివారం రోజు హైదరాబాద్ లో సిఎం రేవంత్ రెడ్డి ని కలిసి విన్నవించారు. ఈసందర్భంగా సిఎంను మాజీ ఎమ్మెల్యే సన్మానించారు. ఆనంతరం నియోజక వర్గo లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలనీ , దీని కొరకు అవసరం అయినా స్థలం ఉన్నదని  సిఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇదివరకే మంజూరు అయినా అర్లి బ్రిడ్జి ను కొత్త ప్రతిపాదనలతో  అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు. అదే విధంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రంలో ఇది వరకే మంజూరు అయినా 42 కోట్ల రూపాయిల పనులను మాస్టర్ ప్లాన్ ప్రకారం పనులు ప్రారంభించాలని విన్నవించారు. 2023 వర్ష కాలం లో అతి భారీ వర్షాల వల్ల నష్టం జరిగిన చెరువులకు నిధులు మంజూరు చేసి రైతులకు సహాయ పడాలని పేర్కొన్నారు. ‌ముధోల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి  పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు. దీనికి సిఎం సానుకూలంగా స్పందించిన్నట్లు మాజీఎమ్మెల్యే తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -